నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 20:15

ఫోన్ ట్యాపింగ్ కేసు: పోలీసుల అదుపులో ఏఎస్పీ భుజంగరావు

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరో కీలక మలుపు చోటు చేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

ప్రణీత్ రావుతో కలిసి భుజంగరావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి..

భూపాలపల్లి ఏఎస్పీగా ఉన్న భుజంగరావు.. గతంలో తెలంగాణ ఇంటెలిజెన్స్‌లో పనిచేశారు. రేపు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరు పర్చునున్నారు. ప్రణీత్ రావును, భుజంగరావును శనివారం పోలీసులు ఎనిమిది గంటలపాటు విచారించారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ పోలీసులు.. భుజంగరావు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్రావును ఇప్పటికే ఆరు రోజుల పాటు పోలీసులు విచారించారు. రేపు( ఆదివారం) మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచే అవకాశం ఉ‍న్నట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. ఎస్‌ఐబీలో పని చేసిన పలువురు అధికారులు, కానిస్టేబుల్స్‌ను పిలిచి విచారించారు..

మరోవైపు ఎస్‌ఐబీలో పని చేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో స్పెషల్ టీమ్ ముందు హాజరయ్యారు. వీరితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్‌ఐబీలో పని చేసిన వాళ్లందరినీ విచారించే అవకాశం ఉ‍న్నట్లు తెలుస్తోంది..

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 20:14

ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాల్లోనూ ఈడీ సోదాలు

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. కవిత భర్త అనిల్‌ బంధువుల ఇళ్లలో శనివారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి..

మాదాపూర్‌లో అనిల్‌ సోదరి అఖిల నివాసంలో అధికారులు తనిఖీలు చేపట్టారు..

మరోవైపు కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 12.30 తర్వాత ఆమెను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.

మద్యం కేసులో దిల్లీ సీఎంను తమ కస్టడీకి తీసుకున్న ఈడీ అధికారులు.. కేజ్రీవాల్, కవితను ఒకేసారి విచారించే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో కవితను మరో 3 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరనున్నట్లు సమాచారం..

Streebuzz News

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 20:13

సికింద్రాబాద్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావుగౌడ్‌

సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ప్రక టించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్‌ను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ లోకి దింపాలని నిర్ణయిం చారు.

పార్టీ శాసన సభ్యులు, ప్రజాప్రతినిధుల ఇతర ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో అభిప్రాయా లను సేకరించిన అనంతరం నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్

కాగా...కేసీఆర్.పార్టీ సీని యర్‌ నేతగా ఉద్యమకాలం నుంచి, విధేయుడిగా పద్మా రావు గౌడ్‌ గుర్తింపు తెచ్చు కున్నారని ఆ పార్టీ నేతలు చెబుతారు.

SB News

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 20:11

కారుణ్య నియమాలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సిగ్నల్

విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాలకు బ్రేక్ వేస్తూ గత సర్కారు తీసుకున్న విధాన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. విధి నిర్వహణలో ఉంటూ చనిపోయినవారి పిల్లలకు కారుణ్య నియామకాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.

మార్చి 4, 2020న జరిగిన 42వ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం, దానికి అనుగుణంగా ఏప్రిల్ 29, 2020న విడుదల చేసిన ఉత్తర్వులను తాజా ప్రభు త్వం ఉపసంహరించుకు న్నది.

దీంతో కారుణ్య నియామ కాలకు వెసులుబాటు లభిం చింది. గత ప్రభుత్వం లో కారుణ్య నియామకాల కోసం వచ్చిన దరఖాస్తులను తిరస్కరించడంతో ఇప్పుడు వాటిని మళ్ళీ పరిగణనలోకి తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది.

ఇందుకు అనుగుణంగా ఏకీకృత యూనిఫాం పాలసీని రూపొందించా లంటూ విద్యుత్ శాఖ పరిధిలోని అన్ని కార్పొరేట్ ఆఫీసులకు సీఎండీ తాజా గా,ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో కారుణ్య నియామ కం కోసం దరఖాస్తు చేసుకు న్నవారికి మళ్లీ అప్లికేషన్ ప్రొఫార్మా ఫార్మాట్ ను రూ పొందించాలని, మరోసారి దరఖాస్తు చేసుకోడానికి వారికి అవకాశం కల్పించా లని సూచించారు.

చనిపోయిన ఉద్యోగుల పిల్లల/జీవిత భాగస్వామికి మాత్రమే కాకుండా విధి నిర్వహణకు శారీరకంగా స్థోమత లేని ఉద్యోగుల విషయంలోనూ కారుణ్య నియామకాలకు అవకాశం ఇవ్వాలని తాజా ఉత్త ర్వుల్లో సీఎండీ పేర్కొ న్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 20:10

భారీగా పెరిగిన టెట్ పరీక్ష ఫీజు

రాష్ట్ర ప్రభుత్వం టెట్ ఫీజు ను భారీగా పెంచింది. గతం లో ఒక పేపర్‌ రాస్తేరూ.200 రుసుం ఉండగా, దాన్నిరూ. వెయ్యికి పెంచింది.

రెండు పేపర్లు రాస్తే గతంలో రూ.300 రుసుం ఉండగా, దాన్ని రూ.2,000కు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు https:// schooledu.telangana.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిం ది. మే 15 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకో వచ్చని పేర్కొంది...

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 20:02

బీసీల డిమాండ్ల సాధనకై బిసి సామాజిక న్యాయ యాత్ర

•బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నల్లగొండకు చేరుకున్న సామాజిక న్యాయ యాత్ర

•ఘన స్వాగతం పలికిన బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్

 బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆదేశాల మేరకు బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ యాత్ర రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంగా దాంట్లో భాగంగా నల్గొండకు ఈరోజు విచ్చేయడం జరిగింది.

వారికి బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం తెలిపి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లో బీసీల డిమాండ్లు సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు బీసీల జనాభా తమాషా ప్రకారం సీట్లను కేటాయించాలని లేనియెడల బీసీల సత్తా ఏందో రాబోయే లోక్సభ ఎన్నికల్లో చూపిస్తామని అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తున్నాం అన్నారు.

గుజ్జ కృష్ణ నీలం వెంకటేష్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారింగ్ నరేష్ గౌడ్, విద్యార్థి సంఘం నాయకుడు కొంపల్లి రామన్న గౌడ , శివకృష్ణ ,పొగాకు రవికుమార్ యాదవ్ ,నిమ్మను కోటి శివకుమార్ ,పనస శ్రీకాంత్ కళ్యాణి, మనీషా ,లక్ష్మి ,ప్రసన్న ,మహాలక్ష్మి ,మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు .

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 08:48

నేటితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవితను కస్టడీ ఇవా ల్టితో ముగియనున్నది. ఈడీ అధికారులు మరోసారి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చను న్నారు.

ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఈనెల 15 హైద రాబాద్ లో కవితను అరెస్ట్ చేసి 16న ఢిల్లీ కోర్టులో హాజరు పరిచారు.

గత ఆరు రోజులుగా మద్యం కుంభకోణంలో విచారించిన ఈడీ మరింత కీలక సమా చారం. రాబట్టేందుకు ఆమె కస్టడీని మరో వారం రోజులు పొడిగించాలని కోర్టును కోరే అవకాశం ఉంది.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కవితను కలిపి విచారించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరిని కలిపి విచారిస్తే లిక్కర్ స్కాం కు సంబంధిం చిన అన్ని వివరాలు బయ టకు వస్తాయని ఈడీ భావిస్తుంది.

ఇది ఇలా ఉండగా ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఆమె కొడుకు ఆర్య, ఇతర బంధువులు, న్యాయవాది కలిసి మాట్లాడారు. తన కొడుకును చూసిన కవిత త్వరగానే ఇంటికి వస్తానని, బాధ పడవద్దు అంటూ ధైర్యం చెప్పారు...

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 08:47

నేడు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం

ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ అభ్యర్థులపై రానున్న స్పష్టత పై ఇవాళ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థు లపై స్పష్టత రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్ధుల జాబితా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

అభ్యర్థుల ఫైనల్ లిస్టుకు కేంద్ర నాయకత్వం ఆమో దం కోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్ర నేతలతో అభ్యర్థుల ఎంపి కపై మంతనాలు చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 08:46

రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్రదాడి..40 మందికిపైగా మృతి

రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు నరమేధానికి తెగబడ్డారు. స్థానిక అతి పెద్ద సంగీత కచేరీ హాలు లోకి ప్రవేశించిన దుండ గులు పౌరులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో 40 మందికి పైగా మరణించారని, దాదా పు 100 మంది గాయపడ్డా రని రష్యా వార్తా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

మొత్తం 6, వేల మందికిపైగా సామర్థ్యమున్న క్రాకస్‌ సిటీ హాలులో రష్యాలోనే ప్రము ఖ బ్యాండ్‌ అయిన ‘పిక్‌నిక్‌’ సంగీత కార్యక్రమం జరుగు తోంది,రష్యా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన వ్లాది మిర్ పుతిన్ దీంతో అభి మానులు పెద్దఎత్తున పోటెత్తారు.

ఇదే అదనుగా దుండగులు రెచ్చిపోయారు. తొలుత పేలుళ్లకు, ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు. దీంతో మంటలు చెలరే గాయి. ఇది ఉగ్రవాద చర్యేనని రష్యా దర్యాప్తు సంస్థ ప్రకటించింది.

దాడిలో అనేక మంది ముష్కరులు పాల్గొన్నట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తు న్నాయి. బాంబుల దాడిలో మంటల తీవ్రతకు క్రాకస్‌ సిటీ హాలు పైకప్పు కుప్పకూ లినట్టు తెలుస్తుంది. మృతు ల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికా రులు వెల్లడించారు.

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 07:56

ఉత్కంఠ పోరులో బెంగళూరు పై చెన్నై సూపర్ కింగ్ తొలి విజయం

ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా శుక్ర‌వారం జ‌రిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే విజ‌యం సాధించింది. 174 ప‌రుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలుపొం దింది.

తొలి బంతినుంచే బౌండరీల తో దూకుడుగా ఆడిన సీఎస్‌కే… వికెట్లు పడుతున్న రన్‌రేట్ పడిపోకుండా ఆడింది. దీంతో 4 వికెట్ల నష్టానికి 18.4 ఓవర్లలోనే టార్గెన్‌ను చేధించింది.

రుతురాజ్ గైక్వాడ్ (15), రచిన్ రవీంద్ర (37), అజింక్యా రహానే (27), డారిల్ మిచెల్ (22), శివమ్ దూబే 34 నాటౌట్, రవీంద్ర జడేజా 25 నాటౌట్ ఆకట్టుకున్నారు.

ఇక ఆర్సీబీతో బౌలర్లలో కామెరాన్ గ్రీన్ 2 వికెట్లు తీయగా.. కర్ణ్ శర్మ, యశ్ దయాళ్ చరో వికెట్ దక్కించుకున్నారు.

అంతక ముందు ఆర్సీబీ బ్యాటింగ్‌లో కెప్టెన్ డుప్లెసిస్ 35 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రజత్, మ్యాక్స్‌వెల్ వరుసగా డకౌట్ అయ్యి నిరాశపర్చారు. కోహ్లీ 21 పరుగులు, కెమరాన్ గ్రీన్ 18 పరుగులు చేసి వెనుదిరిగారు.

ఇక అనుజ్ రావత్ (48) పరుగులతో చెలరేగగా.. దినేష్ కార్తీక్ (38- నాటౌట్) పరుగులతో ఆకట్టుకున్నా డు. సీఎస్‌కే బౌటర్లలో దీపక్ చాహర్ ఒక వికెట్ దక్కించు కోగా… ముస్తాఫిజుర్ రెహ మాన్ 4 వికెట్లతో మెరిసా డు. కాగా, 174 పరుగల టార్గెట్‌తో చెన్నై జట్టు బరిలోకి దిగనుంది.

ఇక రన్ మెషీన్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్లో అరుదైన రికా ర్డు నమోదు చేశాడు. ఈ ఫార్మాట్ చరిత్రలోనే 12 వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్ మన్ గా నిలిచాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కోహ్లీ 21 పరుగులు చేశాడు.